Sun Dec 21 2025 00:33:38 GMT+0000 (Coordinated Universal Time)
అదే చేస్తే కాకినాడ వస్తా
జనసేన కార్యకర్తలపై రాళ్ల దాడిని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. కాకినాడలో జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగడం అత్యంత హేయమని పవన్ కల్యాణ్ [more]
జనసేన కార్యకర్తలపై రాళ్ల దాడిని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. కాకినాడలో జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగడం అత్యంత హేయమని పవన్ కల్యాణ్ [more]

జనసేన కార్యకర్తలపై రాళ్ల దాడిని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. కాకినాడలో జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగడం అత్యంత హేయమని పవన్ కల్యాణ్ అభిప్రాయ పడ్డారు. అక్కడి ఎమ్మెల్యే అనుచితంగా మాట్లాడటం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ కోరారు. దాడులు చేస్తుంటే వెనకడుగు వేస్తామని అనుకోవద్దని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఇంకా రెచ్చగొడితే తాను కాకినాడకు రావాల్సి ఉంటుందని తెలిపారు.
Next Story

