Sat Dec 06 2025 01:54:55 GMT+0000 (Coordinated Universal Time)
Pattabhi : పట్టాభి పిచ్చి కామెంట్స్.. రాష్ట్రమంతటా దాడులు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ను పట్టాభి దూషించడంతో పట్టాభి ఇంటితో [more]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ను పట్టాభి దూషించడంతో పట్టాభి ఇంటితో [more]

తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ను పట్టాభి దూషించడంతో పట్టాభి ఇంటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. తిరుపతిలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్ పై పట్టాభి వ్యక్తిగత దూషణలకు దిగడంతో ఈ దాడులు జరిగాయి. పంచాయతీలో వార్డు మెంబర్ గా కూడా గెలవలేని పట్టాభి జగన్ ను దూషించడమేంటని వైసీపీ నేతలు దాడులకు దిగారు.
Next Story

