Fri Dec 05 2025 21:50:09 GMT+0000 (Coordinated Universal Time)
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని టీడీపీ తిరుపతి అభ్యర్థి పనబాక లక్ష్మి అభిప్రాయపడ్డారు. తాను ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారన్నారు. [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని టీడీపీ తిరుపతి అభ్యర్థి పనబాక లక్ష్మి అభిప్రాయపడ్డారు. తాను ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారన్నారు. [more]

తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని టీడీపీ తిరుపతి అభ్యర్థి పనబాక లక్ష్మి అభిప్రాయపడ్డారు. తాను ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారన్నారు. అధికార పార్టీపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని పనబాక లక్ష్మి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై జగన్ పెదవి విప్పక పోవడంపై కూడా ప్రజలు అసహనంతో ఉన్నారన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఫలితం అనూహ్యంగా ఉంటుందని పనబాక లక్ష్మి తెలిపారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ అన్ని రకాలుగా నాశనం అయిందని పనబాక లక్ష్మి ఆరోపించారు.
Next Story

