Sun Feb 16 2025 02:09:19 GMT+0000 (Coordinated Universal Time)
ఇదే అంతిమ యుద్ధం: పాక్ మంత్రి
భారత్ – పాకిస్తాన్ మద్య యుద్ధం కనుక వస్తే ఇదే అంతిమ యుద్ధం అయ్యే అవకాశం ఉందని పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ [more]
భారత్ – పాకిస్తాన్ మద్య యుద్ధం కనుక వస్తే ఇదే అంతిమ యుద్ధం అయ్యే అవకాశం ఉందని పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ [more]

భారత్ – పాకిస్తాన్ మద్య యుద్ధం కనుక వస్తే ఇదే అంతిమ యుద్ధం అయ్యే అవకాశం ఉందని పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ పేర్కొన్నారు. రానున్న 72 గంటలు కీలకమైనవని, ఈ 72 గంటల్లోనే యుద్ధమా, శాంతా అనేది తేలిపోతుందని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే అది రెండో ప్రపంచ యుద్ధం కంటే పెద్దది అయ్యే అవకాశం ఉందని అన్నారు. తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. మరో వైపు అన్వస్త్రాలపై నిర్ణయాత్మక కమిటీతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమావేశమయ్యారు.
Next Story