Tue Mar 31 2026 02:52:51 GMT+0530 (India Standard Time)
తెలంగాణ బంద్ 19న?
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జేఏసీ నేతల ఆగ్రహానికి కారణమవుతోంది. టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న ధోరణి సరికాదని అవసరమైతే తెలంగాణ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు [more]
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జేఏసీ నేతల ఆగ్రహానికి కారణమవుతోంది. టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న ధోరణి సరికాదని అవసరమైతే తెలంగాణ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు [more]

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జేఏసీ నేతల ఆగ్రహానికి కారణమవుతోంది. టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న ధోరణి సరికాదని అవసరమైతే తెలంగాణ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి. ఆర్టీసీ సమ్మెకు ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని తెలిపారు. ఈ నెల 19న తెలంగాణ బంద్ కు పిలుపునిస్తామని, దీనిపై మరోసారి అన్ని రాజకీయ పార్టీలతో సమాలోచన చేస్తామన్నారు. ప్రజలు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దుతు తెలపాలని విన్నవించారు. అన్ని డిపోల వద్ద ధర్నాలు చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది.
Next Story
