Fri Jan 30 2026 04:41:41 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ బీజేపీ నేతకు క్వారంటైన్.. లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు?
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డిని అధికారులు క్వారంటైన్ కు పంపారు. ఆయన ఇంట్లోనే నాలుగు వారాల పాటు స్వీయ నిర్బంధంలో [more]
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డిని అధికారులు క్వారంటైన్ కు పంపారు. ఆయన ఇంట్లోనే నాలుగు వారాల పాటు స్వీయ నిర్బంధంలో [more]

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డిని అధికారులు క్వారంటైన్ కు పంపారు. ఆయన ఇంట్లోనే నాలుగు వారాల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు నోటీసులు అందించారు. విష్ణువర్థన్ రెడ్డి ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించి వచ్చారు. అనంతపురం జిల్లా కదిరి నుంచి ఆయన కర్నూలు వెళ్లడాన్ని లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమేనని అధికారులు చెబుతున్నారు. క్వారంటైన్ లో ఉండకుండా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని నోటీసులో అధికారులు పేర్కొన్నారు.
Next Story

