Fri May 17 2024 06:38:25 GMT+0000 (Coordinated Universal Time)
నిర్మలకు నిరసన సెగ
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ రెండురోజుల పర్యటన కోసం విశాఖపట్నం వచ్చారు. అయితే ఆమెకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల నుంచి నిరసన సెగ తగిలింది. నిర్మలా సీతారామన్ [more]
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ రెండురోజుల పర్యటన కోసం విశాఖపట్నం వచ్చారు. అయితే ఆమెకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల నుంచి నిరసన సెగ తగిలింది. నిర్మలా సీతారామన్ [more]
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ రెండురోజుల పర్యటన కోసం విశాఖపట్నం వచ్చారు. అయితే ఆమెకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల నుంచి నిరసన సెగ తగిలింది. నిర్మలా సీతారామన్ ను అడ్డుకునేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు విశాఖ ఎయిర్ పోర్టు కు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేవారు. అయితే స్టీల్ ప్లాంట్ కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో నిర్మలా సీతారామన్ ఎయిర్ పోర్టు నుంచి బయటపడ్డారు. రేపు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పొందూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళతారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story