Sun Feb 01 2026 09:27:42 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డను అప్పటి వరకూ… లాభం లేదట
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. గవర్నర్ హైకోర్టు ఆదేశాలను పాటించాలని సూచించినా ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. గవర్నర్ హైకోర్టు ఆదేశాలను పాటించాలని సూచించినా ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో [more]

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. గవర్నర్ హైకోర్టు ఆదేశాలను పాటించాలని సూచించినా ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడ విచారణ సాగుతుంది. మరోవైపు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం పిటీషన్ వేసింది. ఈ విచారణ రేపు జరగనుంది. రేపటి వరకూ ఆగి సుప్రీంకోర్టు తీర్పును చూసిన తర్వాతనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.
Next Story

