Thu Jan 29 2026 05:31:05 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డకు ఎదురుదెబ్బ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టింది. ఎంసీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చెల్లుతాయని [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టింది. ఎంసీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చెల్లుతాయని [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టింది. ఎంసీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చెల్లుతాయని చెప్పింది. ఏకగ్రీవాలు అయిన వారికి వెంటనే డిక్లరేషన్ లు ఇవ్వాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ఎవరైనా నామినేషన్లు బెదిరింపులు కారణంగా వేయలేకపోతే వాటిపై దర్యాప్తు జరిపి వారిని అభ్యర్థులుగా నిర్ణయిస్తామని ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఏకగ్రీవాలు అయిన వాటిపై దర్యాప్తు జరపడానికి వీలులేదని పేర్కొంది.
Next Story

