Sun Mar 15 2026 13:27:26 GMT+0530 (India Standard Time)
నిమ్మగడ్డ న్యాయస్థానాన్ని తప్పు దోవ పట్టించారా? నేడు విచారణ
రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తరుపున న్యాయవాది అన్నారు. హైకోర్టులో [more]
రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తరుపున న్యాయవాది అన్నారు. హైకోర్టులో [more]

రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తరుపున న్యాయవాది అన్నారు. హైకోర్టులో విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కు రాసిన లేఖలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, పంచాయతీరాజ్ కార్యదర్శికి కూడా పంపారన్న విషయాన్ని న్యాయస్థానం ముందు దాచిపెట్టారని న్యాయవాది వాదించారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని ఆయన హైకోర్టును కోరారు. దీనిపై విచారణను హైకోర్టు నేటికి వాయిదా వేసింది.
Next Story

