ముఖ్యమంత్రి సలహాదారు నీలం సాహ్ని తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిది. నీలం సాహ్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా ఉన్నారు. రెండేళ్ల పాటు ఆమె పదవీ కాలం ఉంది. అయితే నీలం సాహ్నిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించడంతో ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 31వ తేదీతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం పూర్తవుతుంది. ఆ వెంటనే ఎస్ఈసీగా బాధ్యతలు చేపడతారు.
Mon May 23 2022 08:02:27 GMT+0000 (Coordinated Universal Time)
Next Story