Tue May 07 2024 19:30:17 GMT+0000 (Coordinated Universal Time)
అగ్రనేతలు దిగుతున్నారు..!
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి జాతీయ పార్టీల అగ్రనేతలు దిగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 3, 5వ తేదీల్లో రాష్ట్రంలో నాలుగు సభల్లో ఆయన పాల్గొని ప్రచారం చేయనున్నారు. మరో వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఈ నెల చివర్లోనే ప్రచారపర్వంలోకి దిగనున్నారు. ఈ నెల 25, 27, 28 తేదీల్లో ఆయన తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు.
రెండు సభల్లో పాల్గొననున్న సోనియా గాంధీ
తెలంగాణ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ కూడా ప్రచారం చేయనున్నారు. సోనియా గాంధీ ఈ నెల 23వ తేదీ ఆమె రాష్ట్రంలో పర్యటించనున్నారు. సోనియా గాంధీతో రెండు సభలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీతోనూ కనీసం 8 - 10 సభలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది.
Next Story