Mon Feb 02 2026 06:27:17 GMT+0000 (Coordinated Universal Time)
శభాష్...అన్న చంద్రబాబు

రాజ్యసభలో చర్చ ద్వారా దేశ ప్రజలను మెప్పించగలిగామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయ పడ్డారు. రాజ్యసభలో ఎంపీలు పోరాడిన తీరును ఆయన ప్రశంసించారు. చంద్రబాబు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన మోసాన్ని రాజ్యసభ లో ఎండగట్టడంలో ఎంపీలు సక్సెస్ అయ్యారని చంద్రబాబు అభినందించారు. తాను ప్రత్యేక హోదా విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాటం కొనసాగించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు తమ పోరాటానికి మద్దతిచ్చాయన్నారు. అనేక పార్టీల సహకారాన్ని కూడగట్టగలిగామన్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- nara chandrababu naidu
- pavan kalyan
- rajyasabha
- special status
- teleconference
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- టెలికాన్ఫరెన్స్
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ప్రత్యేక హోదా
- రాజ్యసభ
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story
