Mon Apr 29 2024 19:54:53 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బాబు హాజరవ్వాల్సిందేనా?
బాబ్లీ కేసును ధర్మాబాద్ కోర్టు అక్టోబరు 15వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈ కేసు విచారణకు హాజరైన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాబాబ్ కోర్టు. మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ప్రకాశ్ గౌడ్, రత్నంలకు బెయిల్ మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరుపున న్యాయవాదులు రీకాల్ పిటీషన్ వేశారు. నాన్ బెయిల్ వారెంట్ ను రద్దు చేయాలని కోరుతూ రీకాల్ పిటీషన్ వేశారు. నోటీసులు అందుకున్న వారంతా కోర్టుకు హాజరవ్వాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో నారా చంద్రబాబునాయుడు కోర్టుకు హాజర్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి.2010లో బాబ్లీ ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా అప్పటి తెలుగుదేశం నేతలపై కేసు నమోదయిన సంగతి తెలిసిందే.
Next Story