Fri May 03 2024 05:04:25 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై హత్యాయత్నం ఎందుకు చేశాడు..?
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన దుండగుడు జానిపల్లి శ్రీనివాసరావుగా గుర్తించారు. శ్రీనివాసరావుది అమలాపురం గా తెలుస్తోంది. అతడు ఇటీవలే ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ లో వెయిటర్ గా ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. శ్రీనివాసరావు ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీలో చేరినట్లు సమాచారం. ఇక ఈ రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ టీడీపీ నాయకుడు. ఆయన గతంలో గాజువాక తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నించాడు.
Next Story