Thu Jan 29 2026 04:39:44 GMT+0000 (Coordinated Universal Time)
మురళీ మోహన్ వద్దకు వెళ్లి…?
మాజీ పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇటీవల వెన్నెముకకు సంబంధించి ఆపరేషన్ జరిగింది. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇటీవల వెన్నెముకకు సంబంధించి ఆపరేషన్ జరిగింది. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు [more]

మాజీ పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇటీవల వెన్నెముకకు సంబంధించి ఆపరేషన్ జరిగింది. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. విశ్రాంతి తీసుకుంటున్న మురళీ మోహన్ ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నారా లోకేష్ లు పరామర్శించారు. మురళీ మోహన్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. ఇప్పటికే చిరంజీవి మురళీ మోహన్ ను పరామర్శించారు. కొద్దిగా కోలుకున్న వెంటనే తాను రాజమండ్రి వచ్చి పార్టీ కార్యకర్తలను కలవనున్నట్లు మురళీ మోహన్ ట్విట్టర్లో తెలిపారు.
Next Story

