Wed May 01 2024 12:05:55 GMT+0000 (Coordinated Universal Time)
మురళీ మోహన్ కు ఏపీ ప్రభుత్వం భారీ జరిమానా
తెలుగుదేశం పార్టీ నేత మురళీ మోహన్ కు ఏపీ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. జయభేరి కన్ స్ట్రక్షన్స్ కు కోటిన్నర జరిమానా విధించింది. అమరావతి ప్రాంతంలో [more]
తెలుగుదేశం పార్టీ నేత మురళీ మోహన్ కు ఏపీ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. జయభేరి కన్ స్ట్రక్షన్స్ కు కోటిన్నర జరిమానా విధించింది. అమరావతి ప్రాంతంలో [more]
తెలుగుదేశం పార్టీ నేత మురళీ మోహన్ కు ఏపీ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. జయభేరి కన్ స్ట్రక్షన్స్ కు కోటిన్నర జరిమానా విధించింది. అమరావతి ప్రాంతంలో ఏడు ఎకరాల్లో వ్యవసాయ భూమిలో ఇళ్లను నిర్మిస్తున్నారు. వ్యవసాయ భూమిని కన్వర్ట్ చేయకుండానే ఇళ్ల నిర్మాణానికి వినియోగిస్తుండటంతో ప్రభుత్వం దీనిపై జయభేరి సంస్థకు జరిమానా విధంచింది. ల్యాండ్ కన్వర్షన్ ఫీజు కోటి రూపాయలు, మరో యాభైలక్షలు జరిమానా విధించింది. అయితే మురళి మోహన్ వెంటనే ఈ జరిమానాను చెల్లించినట్లు తెలుస్తోంది.
Next Story