Thu Dec 18 2025 07:38:14 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు ముద్రగడ….?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఇసుక కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇసుకపై కొత్త [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఇసుక కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇసుకపై కొత్త [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఇసుక కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇసుకపై కొత్త పాలసీని తీసుకురావడం మంచిదేనని అభిప్రాయపడ్డ ముద్రగడ పద్మనాభం ఇసుక అవసరమైనంత మేరకు ఉచితంగా పంపీణీ చేయాలని కోరారు. వరద ఉధృతి తగ్గేంత వరకూ ఇసుకను ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. జగన్ కొత్త పథకాలను ఇచ్చేందుకు తాపత్రయపడుతున్నారన్న ముద్రగడ పద్మనాభం ఆ తాపత్రయం కాపు రిజర్వేషన్లపై చూపాలని జగన్ ను తన లేఖలో కోరారు. ఇసుకతో ఎంతటి ఇబ్బంది పడుతున్నారో కాపు రిజర్వేషన్లు అందక తమ జాతి కూడా అంతే ఇబ్బంది పడుతుందని జగన్ కు లేఖలో ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు.
Next Story

