Sun Mar 08 2026 00:12:26 GMT+0530 (India Standard Time)
భారీ బందోబస్తు మధ్య….మోపిదేవి వల్ల అవుతుందా?
తూర్పు గోదావరి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ వైసీపీలో గ్రూపు విభేదాలను పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. రాజోలు వైసీీపీలో గ్రూపు విభేదాలున్నాయి. ఇప్పటికే ఇద్దరు వైసీపీ [more]
తూర్పు గోదావరి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ వైసీపీలో గ్రూపు విభేదాలను పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. రాజోలు వైసీీపీలో గ్రూపు విభేదాలున్నాయి. ఇప్పటికే ఇద్దరు వైసీపీ [more]

తూర్పు గోదావరి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ వైసీపీలో గ్రూపు విభేదాలను పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. రాజోలు వైసీీపీలో గ్రూపు విభేదాలున్నాయి. ఇప్పటికే ఇద్దరు వైసీపీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాజోలు నియోజకవర్గంలో బొంతు, అమ్మాజీ గ్రూపులుగా మారి పార్టీని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. అందుకే వాటికి చెక్ పెట్టేందుకు మంత్రి మోపిదేవి వెంకటరమణ రంగంలోకి దిగారు. ఈరోజు సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

