Mon Dec 15 2025 04:30:31 GMT+0000 (Coordinated Universal Time)
బాబు ట్రాప్ లో పడొద్దు
శాసనమండలి సభ్యులు చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. మండలిని చంద్రబాబు రాజకీయ వేదికగా ఉపయోగించుకుంటున్నారన్నారు. శాసనమండలిలో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో టీడీపీ [more]
శాసనమండలి సభ్యులు చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. మండలిని చంద్రబాబు రాజకీయ వేదికగా ఉపయోగించుకుంటున్నారన్నారు. శాసనమండలిలో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో టీడీపీ [more]

శాసనమండలి సభ్యులు చంద్రబాబు ట్రాప్ లో పడొద్దని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. మండలిని చంద్రబాబు రాజకీయ వేదికగా ఉపయోగించుకుంటున్నారన్నారు. శాసనమండలిలో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు బాగాలేదని ఆమె తెలిపారు. చంద్రబాబు మండలిలోనే కూర్చుని ఛైర్మన్ షరీఫ్ ను ప్రభావితం చేశారని పోతుల సునీత ఆరోపించారు. నిబంధనలను తుంగలో తొక్కి మరీ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారని చెప్పారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. శాసనమండలి రద్దు అంశం సోమవారం తేలిపోతుందని పోతుల సునీత చెప్పారు.
Next Story

