Sun Jul 03 2022 08:05:22 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీడీపీ నుంచి ఎమ్మెల్యే సస్పెన్షన్

కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇవాళ రాజంపేట నియోజకవర్గానికి చెందిన మేడా వ్యతిరేక వర్గం నేతలు చంద్రబాబును కలిశారు. మేడా పార్టీ మారుతున్నారని, ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో చంద్రబాబు… మేడా మల్లికార్జునరెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మేడా ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా కూడా ఉన్నారు. ఆయన ఇవాళ సాయంత్రం 4 గంటలకు వైసీపీ అధినేత జగన్ ను కలిసి వైసీపీలో చేరనున్నారు.
Next Story