Thu Jan 29 2026 05:31:49 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: వైసీపీలో చేరిన ఎమ్మెల్యే..!
తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి మోసపోయానని, మోసానికి ప్రతీకారం తీర్చుకుంటానని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ [more]
తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి మోసపోయానని, మోసానికి ప్రతీకారం తీర్చుకుంటానని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ [more]

తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి మోసపోయానని, మోసానికి ప్రతీకారం తీర్చుకుంటానని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… తనకు ఏదైనా పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పారని, కానీ తనకు అవసరం లేదని వచ్చేశానని తెలిపారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరి తప్పు చేశానని, తప్పును సరిదిద్దుకోవడానికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా చేరుతున్నాన్నట్లు తెలిపారు. జిల్లాలో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
Next Story
