Fri Dec 05 2025 20:18:22 GMT+0000 (Coordinated Universal Time)
ఈసారి వదలిపెట్టం.. నిలదీయడం గ్యారంటీ
రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో గళమెత్తుతామని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అన్నారు. రెండున్నరేళ్ల నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, పోలవరం [more]
రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో గళమెత్తుతామని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అన్నారు. రెండున్నరేళ్ల నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, పోలవరం [more]

రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో గళమెత్తుతామని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అన్నారు. రెండున్నరేళ్ల నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, పోలవరం బకాయీలు, స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని మిధున్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా కోసం కూడా పోరాడతామని ఆయన అన్నారు. జీఎస్టీ బకాయీల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ సమావేశాలను తాము ఉపయోగించుకుంటామని మిధున్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు.
Next Story

