Fri Jan 30 2026 13:02:13 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: బీజేపీకి ఆ ఒక్కటేనా?

దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. మొత్తం నాలుగు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగగా కేవలం ఒకే స్థానంలో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్ లోని కైరానా లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుం హసన్ బీజేపీ అభ్యర్థి మృగాంకా సింగ్ పై 75 వేల ఓట్ల అధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, ఎస్ పీ, బీఎస్పీ పార్టీలు తబస్సుంకి మద్దతు ఇచ్చాయి. ఇక నాగాలాండ్ లోని ఏకైక లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన ఎన్పీఎఫ్ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. మహారాష్ట్ర పాల్ఘర్ లో బీజేపీ అభ్యర్థి గవిట్ రాజేంద్ర ధేడ్య ఆధిక్యంలో ఉన్నారు. అదే రాష్ట్రంలోని భండారా - ఘోండియాలో బీజేపీ అభ్యర్థిపై ఎన్సీపీ అభ్యర్థి మూడు వేల ఓట్ల ఆధిక్యంలో ముందంజలో కొనసాగుతున్నారు.
Next Story

