Tue Apr 30 2024 06:38:33 GMT+0000 (Coordinated Universal Time)
ఇది రెండో వెన్నుపోటు
కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి మరోసారి వెన్నుపోటు పొడిచారని ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. టీడీపీ - కాంగ్రెస్ పొత్తుకు నిరసనగా ఆమె శనివారం ఎన్టీఆర్ సమాధి వద్ద నిరసనకు దిగారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎన్టీఆర్ పేరు, ఎన్టీఆర్ ఫోటోను వాడుకునే అర్హతను చంద్రబాబు కోల్పోయారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, ఈ సంఘటన చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆమె లేఖ రాసి ఎన్టీఆర్ సమాధి వద్ద పెట్టారు.
Next Story