Wed Jan 21 2026 08:54:55 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ ఎదుట కోమటిరెడ్డి డిమాండ్లు ఇవే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. కౌలు రైతుల కష్టాలను పట్టించుకోవాలని ఆయన లేఖలో కోరారు. పాస్ బుక్ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. కౌలు రైతుల కష్టాలను పట్టించుకోవాలని ఆయన లేఖలో కోరారు. పాస్ బుక్ [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. కౌలు రైతుల కష్టాలను పట్టించుకోవాలని ఆయన లేఖలో కోరారు. పాస్ బుక్ ఉన్న రైతులకే అరకొర డబ్బులను ప్రభుత్వం ఇస్తుందన్నారు. కౌలు రైతులను అసలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖలో పేర్కొన్నారు. అనేక మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన లేఖలో కోరారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు పది లక్షల ఆర్థికసాయం అందించాలని ఆయన తన లేఖలో కోరారు.
Next Story

