Thu Dec 18 2025 17:49:55 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఉత్తర్వులను తిరస్కరించిన కోడెల కుటుంబం
కోడెల శివప్రసాద్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరపడానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. నవ్యాంధ్రకు తొలి స్పీకర్ కావడంతో [more]
కోడెల శివప్రసాద్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరపడానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. నవ్యాంధ్రకు తొలి స్పీకర్ కావడంతో [more]

కోడెల శివప్రసాద్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరపడానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. నవ్యాంధ్రకు తొలి స్పీకర్ కావడంతో జగన్ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరపాలని నిర్ణయించింది. అయితే కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ప్రభుత్వ వేధింపులతోనే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు భావిస్తుండటంతో జగన్ ప్రతిపాదనను కోడెల కుటుంబం తిరస్కరించింది. ఆయనకు సాధారణంగానే అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు.
Next Story

