వారం రోజలు ఆగాల్సిందేనా?
ఎక్కడ చూసినా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఎలా చనిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ఇటు టీడీపీ నాయకులు, మరోవైపు వైసీపీ మంత్రులు [more]
ఎక్కడ చూసినా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఎలా చనిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ఇటు టీడీపీ నాయకులు, మరోవైపు వైసీపీ మంత్రులు [more]
ఎక్కడ చూసినా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఎలా చనిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ఇటు టీడీపీ నాయకులు, మరోవైపు వైసీపీ మంత్రులు వాదోపవాదాలు చేసుకుంటుండంతో ఈ అనుమానాలు రాక తప్పదు. ప్రభుత్వం కేసులు పెట్టడంతోనే ఇబ్బంది పడి ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నాయకులు అంటుండగా…. కోడెలకు పార్టీలో సరైన ప్రాముఖ్యత కల్పించక పక్కకు పెట్టడంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ ఆరోపించుకుంటున్నారు. మొత్తానికి కోడెల ఆత్మహత్య వెనుక ఏం జరిగిందో తెలియాలంటే కొన్నివిషయాలు పరిశీలించాల్సిందే.
మొబైలే కీలకం….
కోడెల ఆత్మహత్యలో చిక్కుముడి వీడాలంటే అందులో కీలకమైంది ఆయన ఉపయోగించిన మొబైల్ ఫోనే. అది దొరికితే కొంతవరకు అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం ఉంది. కాని పోలీసులకు ఇప్పటి వరకూ మొబైల్ స్వాధీనం చేసుకోలేకపోయారు. కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిలో అన్ని దొరికినా మొబైల్ దొరకక పోవడంతో ఇప్పుడన్నీ అనుమానాలు ఆ ఫోన్ చుట్టే తిరుగుతున్నాయి. కోడెల టిఫిన్ చేసిన తర్వాత మొబైల్ ను పైన గదిలోకి తీసుకువెళ్లలేదని తెలుస్తోంది. అంటే ఆ ఫోన్ కిందే ఉండాలి. మరి అది ఎవరి వద్ద ఉంది. కోడెల భార్య వద్ద ఉందా లేక ఆమె కూతురు విజయలక్ష్మి దగ్గర ఉందాననే విషయం మాత్రం బయటపడలేదు. ఇతరులు ఆయన మొబైల్ తీసుకునేంత సాహసం మాత్రం చేయరు.
శోకసంద్రంలో…….
కోడెల అంత్యక్రియలు ఇవ్వాళే జరిగాయి కాబట్టి కుటుంబసభ్యులంతా కూడా శోకసంద్రంలోనే ఉన్నారు. మొత్తం దశదిన కర్మలు పూర్తయితే కాని పోలీసులు కుటుంబసభ్యులతో మాట్లాడే వీలుండదని తెలుస్తోంది. మరోవైపు కోడెల కుమారుడు శివరాంను కూడా విచారించాలనుకుంటున్న పోలీసులకు ఇది కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందుకంటే శివరాం సైతం తండ్రిని పోగొట్టుకున్న బాధలో ఉన్నారు.
తెలంగాణ పోలీసులపైనే చూపు…..
ఉమ్మడి రాష్ట్రంలో పేరుపొందిన కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు పోలీసులకు సవాలుగా మారింది. ఎందుకంటే ఓ వైపు ఏపీ ప్రభుత్వ మంత్రులు, మరోవైపు ఏపీ టీడీపీ నాయకులు పరస్పర ఆరోపణలు ఒకఎత్తైతే, మరోవైపు కోడెల కేసు తెలంగాణ లో కావడంతో అందరి చూపు తెలంగాణ పోలీసులపైనే ఉంది. దీంతో పోలీసులు సైతం మూడు బృందాలను ఏర్పాటు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. కోడెల మొబైల్ ఫోన్ దొరకాలంటే ఇంకా కనీసం వారం రోజులైనా పోలీసులు ఆగాల్సి వస్తుందేమో ఎందుకంటే అప్పటికాని కుటుంబసభ్యులు కొంత కోలుకోలేరు.
పోలీసులు ఏం చేయనున్నారు…?
దీంతో పోలీసులు మరో కొత్త పంధా ఎంచుకున్నారు. కోడెల వాడినటువంటి మొబైల్ నెంబర్ కు సంబంధించిన కంపెనీకి లేఖరాసి ఆ నెంబర్ పై ఉన్న డేటాను సేకరించే అవకాశం ఉంది. ఇందుకోసం డీసీపీ స్థాయి అధికారి సదరు కంపెనీకి లేఖ రాయాల్సి ఉంటుంది. ఈ లేఖను పంపిస్తే రెండు రోజుల్లో కాల్ డేటా రావచ్చు. ఆ వచ్చిన డేటాతో దర్యాప్తు జరిపితే పూర్తి వివరాలు బయటపడే అవకాశాలున్నాయి. అయితే కాల్ డేటా వచ్చినప్పటికి మొబైల్ కి వచ్చిన మెస్సేజ్ లు మాత్రం దొరకడం కష్టమైన పనే. సో పోలీసులు ఈ కోణంలోనూ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు ఈ కేసులో కొన్ని అంశాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. కోడెల ఆత్మహత్య చేసుకున్న రోజు ఉదయం 8 ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం. మొత్తం ఈ 8 కాల్స్ తో 24 నిమిషాల పాటు కోడెల మాట్లాడినట్లు పోలీసులు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. మరి వారెవరు….? ఏం మాట్లాడరనేది ఇప్పటికి మాత్రం సస్పెన్సే.