Wed Feb 11 2026 09:19:55 GMT+0530 (India Standard Time)
తెలంగాణ కాంగ్రెస్ నేతకు కీలక పదవి
తెలంగాణ కాంగ్రెస్ నేతకు ఏఐసీసీలో కీలక పదవి దక్కింది. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా తెలంగాణకు చెందిన దాసోజు శ్రవణ్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం పీసీసీ అధికార ప్రతినిధిగా [more]
తెలంగాణ కాంగ్రెస్ నేతకు ఏఐసీసీలో కీలక పదవి దక్కింది. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా తెలంగాణకు చెందిన దాసోజు శ్రవణ్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం పీసీసీ అధికార ప్రతినిధిగా [more]

తెలంగాణ కాంగ్రెస్ నేతకు ఏఐసీసీలో కీలక పదవి దక్కింది. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా తెలంగాణకు చెందిన దాసోజు శ్రవణ్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం పీసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఉన్నత విద్యావంతుడైన శ్రవణ్ కి ఇంగ్లీష్, హిందీ భాషల్లో మంచి పట్టుతో పాటు వర్తమాన రాజకీయ అంశాలపై విశేష అవగాహన ఉంది. రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తే ఎక్కువగా శ్రవణ్ ఆయన ప్రసంగానికి అనువాదం చేస్తారు. దీంతో రాహుల్ దృష్టిలో పడ్డ శ్రవణ్ కు కీలక పదవి దక్కింది. ఇటీవలి ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన దానం నాగేందర్ పై ఓటమి పాలయ్యారు.
Next Story
