Tue Dec 09 2025 15:14:22 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : దూసుకుపోతున్న ముఖ్యనేతలు

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ముఖ్యనేతలంతా ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్ రావు, గజ్వెల్ లో కేసీఆర్, పట్నం మహేందర్ రెడ్డి ఆధిక్యతలో ఉన్నారు. సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఆధిక్యతలో ఉన్నారు. శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ 2 వేల ఓట్ల ఆధిక్యతలో ఉంది. గోషామహాల్ లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఆదిక్యతలో ఉన్నారు. రామగుండంలో ఇండిపెండెంట్ అభ్యర్థి కోరుకంటి చందర్ లో లీడ్ లో ఉన్నారు.
Next Story

