Mon Dec 15 2025 19:22:55 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ముగ్గురూ రెండు రాష్ట్రాలను దోచుకునేందుకే?
కేసీఆర్, జగన్, షర్మిలది ట్రయాంగిల్ బిజినెస్ స్టోరీ అని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అన్నారు. ముగ్గురూ కలసి రెండు రాష్ట్రాలను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కేసీఆర్, [more]
కేసీఆర్, జగన్, షర్మిలది ట్రయాంగిల్ బిజినెస్ స్టోరీ అని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అన్నారు. ముగ్గురూ కలసి రెండు రాష్ట్రాలను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కేసీఆర్, [more]

కేసీఆర్, జగన్, షర్మిలది ట్రయాంగిల్ బిజినెస్ స్టోరీ అని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అన్నారు. ముగ్గురూ కలసి రెండు రాష్ట్రాలను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒకటేనని, ఎన్నికల సమయంలో ఇద్దరూ ఒకరినొకరు సహకరించుకున్నారని కేశినేని నాని తెలిపారు. జగన్ ఆస్తులు, పెట్టుబడులు అన్నీ హైదరాబాద్ లో ఉన్నాయని, అందుకే కేసీఆర్ కు ఒగ్గి ఉంటున్నారని కేశినేని నాని ఆరోపించారు. కేసీఆర్ నీటి వాటా కోసం పోరాటం చేస్తుంటే, జగన్ ఏం చేస్తున్నారని కేశినేని నాని ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ లు ఇద్దరూ నాటకాలాడుతున్నారని కేశినేని నాని విమర్శించారు.
Next Story

