Mon Dec 08 2025 11:08:05 GMT+0000 (Coordinated Universal Time)
పీపీ ఒక కీర్తి శిఖరం
పీవీ నరసింహారావు అనేక పదవులు చేపట్టినా వాటికి వన్నె తెచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా నెక్లెస్ [more]
పీవీ నరసింహారావు అనేక పదవులు చేపట్టినా వాటికి వన్నె తెచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా నెక్లెస్ [more]

పీవీ నరసింహారావు అనేక పదవులు చేపట్టినా వాటికి వన్నె తెచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్ గా నామకరణం చేశారు. దీనిని గవర్నర్ తమిళి సై ప్రారంభించారు. 26 అడుగుల పీవీ నరసింహరావు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీ ఒక కీర్తి శిఖరం అని అన్నారు. విద్యానిధి, సాహిత్య పెన్నిధి అని కేసీఆర్ ప్రశంసించారు. పీవీ ఆశయాలను ముందుకు తీసుకెళతామని కేసీఆర్ అన్నారు. పీవీ నరసింహారావు తెచ్చిన సంస్కరణలను అమలు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కేసీఆర్ అన్నారు.
Next Story

