రూటుమార్చిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు
కర్ణాటక కాంగ్రెస్, జనతాదళ్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మరికాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. హైదరాబాద్ లోని స్టార్ హోటల్ వీరికి బస ఏర్పాటు చేశారు. బస ఏర్పాట్లను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసుకుంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ 78 స్థానాలను, జనతాదళ్ 38 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే బి.ఎస్. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం, బలపరీక్ష కు పదిహేను రోజులు బలపరీక్షకు సమయం గవర్నర్ ఇవ్వడంతో వారందరినీ హైదరాబాద్ కు తరలిస్తున్నారు. తొలుత కొచ్చి కి వెళదామనుకున్న కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ రూటు మార్చుకుని హైదరాబాద్ కు బయలుదేరారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో వీరికోసం 70 గదులను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. పార్క్ హయత్ హోటల్ తో పాటు నగర శివార్లలోని ఒక రిసార్ట్ ను కూడా బుక్ చేసుకున్నారు.
- Tags
- amith shah
- bangalore
- bharathiya janatha party
- devegouda
- governor
- hyderabad
- indian national congress
- janathadal s
- karnataka
- karnataka assembly elections
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- sidharamaiah
- sriramulu
- yadurppa
- అమిత్ షా
- కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు
- కర్ణాటక
- కుమారస్వామి
- గవర్నర్
- జనతాదళ్
- దేవెగౌడ
- నరేంద్ర మోదీ
- బి.ఎస్.యడ్యూరప్ప
- బెంగుళూరు
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- యడ్యూరప్ప
- రాహుల్ గాంధీ
- శ్రీరాములు
- సిద్ధరామయ్య
- హైైదరాబాద్