Fri Jan 30 2026 07:16:22 GMT+0000 (Coordinated Universal Time)
కొలువుదీరిన మంత్రివర్గం...

ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండువారాలకు ఎట్టకేలకు కర్ణాటకలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. గవర్నర్ వాజుభాయ్ వాలా రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు చెందిన 7 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు బీఎస్పీతో పొత్తుపెట్టుకున్న జేడీఎస్ మంత్రి వర్గంలో బీఎస్సీకి చెందిన ఏకైక ఎమ్మెల్యేకు స్థానం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సుదీర్ఘ చర్చల అనంతరం మంత్రివర్గాన్ని ఖరారు చేశారు.
Next Story

