Mon Apr 29 2024 15:06:06 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : చివరి నిమిషంలో బీజేపీ
కర్ణాటకలో కుమారస్వామి బలపరీక్ష జరగానికి ముందు తొలుత స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ అభ్యర్థికి బీజేపీ పోటీకి నిలిపింది. బీజేపీ తరుపున ఎమ్మెల్యే సురేష్ కుమార్ స్పీకర్ పదవికి నామినేషన్ వేయడంతో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ తరుపున రమేష్ కుమార్ పోటీ పడ్డారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ పోటి నుంచి తప్పుకోవడంతో స్పీకర్ గా రమేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ అభ్యర్థిగా రమేష్ కుమార్ ను మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించారు. స్పీకర్ గా ఎన్నికైన రమేష్ కుమార్ ను యడ్యూరప్ప, సిద్ధరామయ్య, కుమారస్వామిలు అభినందించారు. ప్రస్తుతం బలపరీక్షను ఎదుర్కొననున్న కుమారస్వామి ప్రసంగిస్తున్నారు.
- Tags
- amith shah
- bharathiya janatha party
- devegouda
- indian national congress
- janathadal s
- karnataka
- karnataka assembly elections
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- ramesh kumar
- sidharamaiah
- speaker
- sriramulu
- yadurppa
- అమిత్ షా
- కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు
- కర్ణాటక
- కుమారస్వామి
- జనతాదళ్
- దేవెగౌడ
- నరేంద్ర మోదీ
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- యడ్యూరప్ప
- రమేష్ కుమార్
- రాహుల్ గాంధీ
- శ్రీరాములు
- సిద్ధరామయ్య
- స్పీకర్
Next Story