Sat Dec 06 2025 03:18:36 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై కన్నా హార్ష్ కామెంట్స్
జగన్ కుట్రలతోనే అధికారంలోకి వచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన అమరావతికి మోదీ శంకుస్థాపన చేసిన చోట మౌన దీక్ష చేశారు. ప్రాంతీయ [more]
జగన్ కుట్రలతోనే అధికారంలోకి వచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన అమరావతికి మోదీ శంకుస్థాపన చేసిన చోట మౌన దీక్ష చేశారు. ప్రాంతీయ [more]

జగన్ కుట్రలతోనే అధికారంలోకి వచ్చారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన అమరావతికి మోదీ శంకుస్థాపన చేసిన చోట మౌన దీక్ష చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చారన్నారు. జీఎన్ రావు కమిటీ నివేదిక రాకముందే అసెంబ్లీలో ప్రకటన చేశారని, మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకోకముందే విశాఖలో సెక్రటేరియట్ ఎక్కడో చెబుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలన వికేంద్రీకరణకు తాము వ్యతిరేకమని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. మూడు రాజధానులంటూ ఏపీని అమ్మడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని కన్నా ఆరోపించారు.
Next Story

