Tue Jan 20 2026 20:08:07 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కమలన్ నాధ్ బలపరీక్షకు బ్రేక్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వారు బెంగళూరులోని రిసార్ట్స్ లోనే ఉంటున్నారు. బీజేపీ శాసనసభ్యులు మాత్రం అందరూ [more]
మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వారు బెంగళూరులోని రిసార్ట్స్ లోనే ఉంటున్నారు. బీజేపీ శాసనసభ్యులు మాత్రం అందరూ [more]

మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వారు బెంగళూరులోని రిసార్ట్స్ లోనే ఉంటున్నారు. బీజేపీ శాసనసభ్యులు మాత్రం అందరూ హాజరయ్యారు. గురుగావ్ నుంచి వచ్చి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. గవర్నర్ లాల్జీ టాండన్ ఈరోజు కమల్ నాధ్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే స్పీకర్ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు. దీంతో కమల్ నాధ్ ప్రభుత్వ బలపరీక్షకు బ్రేక్ పడింది.
Next Story

