Sat May 04 2024 18:38:55 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డ పై విచారణ జరుపుతాం
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై విచారణ జరుపుతామని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే తాము [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై విచారణ జరుపుతామని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే తాము [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై విచారణ జరుపుతామని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే తాము ఇచ్చిన నోటీసుకు వివరణ ఇచ్చారన్నారు. అయితే తాను కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నందున ప్రయాణాలు చేయలేనని మాత్రమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారన్నారు. ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగిస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవని కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. ఆధారాలను బట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విచారణ జరుపుతామన్నారు.
Next Story