Thu Feb 13 2025 22:09:11 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ సమక్షంలో వైసీపీలో చేరికలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇవాళ అమరావతిలోని తాడేపల్లిలో ప్రారంభమయ్యింది. పార్టీ అధినేత జగన్ సర్వమత ప్రార్థనల అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం చీరాల [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇవాళ అమరావతిలోని తాడేపల్లిలో ప్రారంభమయ్యింది. పార్టీ అధినేత జగన్ సర్వమత ప్రార్థనల అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం చీరాల [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇవాళ అమరావతిలోని తాడేపల్లిలో ప్రారంభమయ్యింది. పార్టీ అధినేత జగన్ సర్వమత ప్రార్థనల అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం చీరాల ఎమ్మెల్యే, టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్, ఎన్టీఆర్ మనవడు, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున అనుచరులు తరలివచ్చారు.
Next Story