Sat Jan 31 2026 21:36:32 GMT+0000 (Coordinated Universal Time)
జియో కొత్త ఆఫర్ గురించి తెలుసా..?

భారీ ఆఫర్లతో టెలికాం రంగంలో తిరుగులేని శక్తిగా అవతరించిన జియో సంస్థ మరో ఆఫర్ ను ప్రకటించింది. జియో 4జీ రూటర్ ను రూ.499కే అందించనున్నట్లు ప్రకటించింది. దీని ధర మొదట్లో రూ.1,999 ఉండగా, తర్వాత రూ.999కి తగ్గించారు. ఇప్పుడు ఇందులోనూ రూ.500 క్యాష్ బ్యాక్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో 4జీ జియోఫై రూటర్ కేవలం రూ.499 కే రానుంది. అయితే, ఇక్కడే ఓ లిటిగేషన్ పెట్టింది కంపెనీ. వినియోగదారులు ఇందుకోసం రూ.199 పోస్ట్ పెయిడ్ ప్లాన్ తీసుకోవాలి. వరుసగా 12 నెలల పాటు ఈ ప్లాన్ కోసం బిల్లు చెల్లిస్తేనే రూ.500 క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కూడా ఒక్కసారి కాదు, 13వ నెల నుంచి చెల్లించే బిల్లులలో కొంత తగ్గిస్తుంటారు. ఆ కొంత ఎంత అనేది ఇంకా ప్రకటించలేదు. రూ.199 ప్లాన్ తో నెలకు 25 జీబీ డేటాతో పాటు ఉచిత వాయిస్ కాల్స్, అన్ లిమిటెడ్ ఎస్ఎంఎస్ లు అందిస్తోంది.
Next Story

