Sat Jul 27 2024 01:42:21 GMT+0000 (Coordinated Universal Time)
వాలంటీర్లతో శాంతిభద్రతల సమస్య
వాలంటీర్లతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశాలున్నాయని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తన లాంటి వారే నామినేషన్లు వేయలేని పరిస్థితిని వైసీపీ [more]
వాలంటీర్లతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశాలున్నాయని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తన లాంటి వారే నామినేషన్లు వేయలేని పరిస్థితిని వైసీపీ [more]
![జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి](https://www.telugupost.com/h-upload/old_images/1195676-jc-prabhakar-new-latest.webp)
వాలంటీర్లతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశాలున్నాయని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తన లాంటి వారే నామినేషన్లు వేయలేని పరిస్థితిని వైసీపీ నేతలు తెచ్చారన్నారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ నామినేషన్ పత్రాన్నే చించివేశారన్నారు. మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు తమకు అవకాశమివ్వాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ మేరకు జల్లా కలెక్టర్ ను కలసి ఆయనకు వినతి పత్రం అందజేశారు. వాలంటీర్లను ఎన్నికల నిర్వహణకు దూరంగా ఉంచాలని, వారి వల్ల భవిష్యత్ లో రాష్ట్ర వ్యాప్తంగా శాంత భద్రతల సమస్యలు తలెత్తే అవకాశముందని చెప్పారు.
Next Story