Thu Jan 29 2026 04:11:44 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ అని అంటుంటే మీరంతా ఏమైపోయారు?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఇష్టమైన నాయకుడని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైఎస్ పై తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆయన [more]
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఇష్టమైన నాయకుడని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైఎస్ పై తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆయన [more]

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఇష్టమైన నాయకుడని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైఎస్ పై తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండి పడ్డారు. రాజశేఖర్ రెడ్డి లాంటి నేతను తెలంగాణ నేతలు తిడుతుంటే ఎవరూ మాట్లాడరేంటని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. వైసీపీ మంత్రులంతా ఏమయిపోయారని నిలదీశారు. వైఎస్ ను రాక్షసుడు అన్నా కూడా స్పందించరా? అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో సెటిలర్స్ ఎవరని? తమ పిల్లలు అక్కడే పుట్టి, అక్కడే చదువుకున్నారని ఏపీ ప్రజలు హైదరాబాద్ కు వెళ్లి షాపింగ్ చేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Next Story

