Tue Mar 24 2026 15:26:35 GMT+0530 (India Standard Time)
అలాగైతే బాబు గెలవరు...జేసీ సంచలన వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ సహాయంతో చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే జనం హర్షించరని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే తమ స్వంత బలం చాలని, ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు రాహుల్ గాంధీ కలవలేదని ఆయన స్పష్టం చేశారు. పొత్తుల కోసం, ఓట్ల కోసం చంద్రబాబు ఆరాటపడటం సరికాదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Next Story

