Sat Mar 28 2026 19:21:30 GMT+0530 (India Standard Time)
జగన్ నన్ను టార్గెట్ చేశారు
జగన్ ప్రభుత్వం వేధింపులు ఎక్కువయ్యాయని మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ లో ప్రతీకార వాంఛ ఎక్కువని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. [more]
జగన్ ప్రభుత్వం వేధింపులు ఎక్కువయ్యాయని మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ లో ప్రతీకార వాంఛ ఎక్కువని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. [more]

జగన్ ప్రభుత్వం వేధింపులు ఎక్కువయ్యాయని మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ లో ప్రతీకార వాంఛ ఎక్కువని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం వేధించినందున పార్టీ మారకూడదని జేసీ అభిప్రాయపడ్డారు. పార్టీ నుంచి వెళ్లే వాళ్లందరూ ఏదో ఒకటి అనడం మామూలు విషయమేనని దానిని పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. ట్రావెల్స్ బిజినెస్ ను కొంతకాలం మానేయాలని అనుకుంటున్నానని, వ్యాపారం కంటే కేసుల గొడవ ఎక్కువగా ఉందని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఎందుకో తనకు తెలియదన్నారు. నన్ను టార్గెట్ చేసి వేధిస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
Next Story

