Tue Apr 30 2024 10:29:48 GMT+0000 (Coordinated Universal Time)
ధవళేశ్వరం బ్యారేజ్ దద్దరిల్లేలా..!
జనసేన కవాతుతో రాజమహేంద్రవరం హోరెత్తుతోంది. ఉభయ గోదావరి జిల్లాలను కలిపి ధవళేశ్వరం బ్యారేజ్ దద్దరిల్లింది. వేలాదిగా తరలివచ్చిన జనసైనికులతో జనసేనాని పవన్ కళ్యాణ్ ముందుకు కదిలారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జనసేన కార్యకర్తలు కవాతుకు తరలివచ్చారు. దీంతో బ్యారేజ్ మొత్తం కార్యకర్తలతో నిండిపోయింది. కవాతో కోసం జనసేన పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. బ్యారేజ్ తో పాటు గోదావరిలో కూడా పడవల్లో జనసేన జెండాలను ఏర్పాటు చేశారు. అయితే, బ్యారేజ్ పై 10 వేలకు మించి జనసమీకరణ జరిగితే ప్రమాదమని పోలీసులు కావాతుకు అనుమతి నిరాకరించారు. అయినా కవాతు యధావిధిగా కొనసాగింది.
Next Story