Fri Jan 30 2026 08:36:59 GMT+0000 (Coordinated Universal Time)
మోడీపై జగన్ తాజా ట్వీట్

రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లయినా ఆంధ్రప్రదేశ్ కి ఇంతవరకు న్యాయం జరగలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. దీనికి కేంద్రం, రాష్ట్రంలో ఉన్న వారే కారణమని, వీరిద్దరూ ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఏపీకి జరిగిన మోసానికి 2019లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
Next Story

