Sun Mar 15 2026 18:23:24 GMT+0530 (India Standard Time)
కాలినడకన బయలుదేరిన జగన్
ప్రజా సంకల్పయాత్ర నిన్న పూర్తి చేసుకున్న ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట రైల్వే స్టేషన్ లో ఆయనకు పార్టీ నాయకులు, [more]
ప్రజా సంకల్పయాత్ర నిన్న పూర్తి చేసుకున్న ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట రైల్వే స్టేషన్ లో ఆయనకు పార్టీ నాయకులు, [more]

ప్రజా సంకల్పయాత్ర నిన్న పూర్తి చేసుకున్న ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట రైల్వే స్టేషన్ లో ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పద్మావతి గెస్ట్ హౌజ్ కి చేరుకుని అక్కడి నుంచి అలిపిరి బయలుదేరారు. జగన్ ని చూసేందుకు పెద్దఎత్తున వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు రావడంతో తిరుపతి రోడ్లతో పాటు అలిపిరి ప్రాంతం కిక్కిరిసిపోయింది. అలిపిరి నుంచి ఆయన తిరుమల కొండపైకి కాలినడకన బయలుదేరారు. ఇవాళ ఆయన సాధారణ భక్తుల క్యూలైన్ లోనే తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆయన స్వరూపానంద స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకోనున్నారు.
Next Story
