Fri Jan 30 2026 14:32:43 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జనవరి మొదటి వారంలో అఖిలపక్షం
జగన్ ప్రభుత్వం జనవరి మొదటి వారంలో అఖిలపక్షం ఏర్పాటు చేయనుంది. రాజధాని అంశంపై చర్చించేందుకు అన్ని పక్షాలను ఆహ్వానించి వారి సలహాలను, సూచనలను తీసుకోవాలనుకుంటోంది. రాజధాని అంశంపై [more]
జగన్ ప్రభుత్వం జనవరి మొదటి వారంలో అఖిలపక్షం ఏర్పాటు చేయనుంది. రాజధాని అంశంపై చర్చించేందుకు అన్ని పక్షాలను ఆహ్వానించి వారి సలహాలను, సూచనలను తీసుకోవాలనుకుంటోంది. రాజధాని అంశంపై [more]

జగన్ ప్రభుత్వం జనవరి మొదటి వారంలో అఖిలపక్షం ఏర్పాటు చేయనుంది. రాజధాని అంశంపై చర్చించేందుకు అన్ని పక్షాలను ఆహ్వానించి వారి సలహాలను, సూచనలను తీసుకోవాలనుకుంటోంది. రాజధాని అంశంపై ఇప్పటికే అన్ని ప్రాంతాలను తిరిగి అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటీ నివేదికను అందించింది. ఈ నివేదికలోని అంశాలను కూడా జగన్ అఖిలపక్ష సమావేశం ముందు పెట్టనున్నారు. అందరితో చర్చించిన తర్వాతనే రాజధానిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కమ్యునిస్టుల పార్టీలతో పాటు కొన్ని ప్రజాసంఘాలను కూడా అఖిలపక్షానికి పిలవాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది.
Next Story

