Sun Apr 28 2024 04:45:36 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీడీపీ నేత ఇంటిపై ఐటీ దాడులు
తెలుగుదేశం పార్టీ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి పరిశ్రమలు, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు చేస్తోంది. చెన్నై టీనగర్ లోని మాగుంట కంపెనీల కార్యాలయం, పూందమల్లిలోని ఫ్యాక్టరీలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. మాగుంట వ్యాపార కార్యకలాపాలన్నీ చెన్నై కేంద్రంగానే జరుగుతున్నాయి. ఏపీలో సీబీఐకి నో చెప్పినా టీడీపీ నేత వ్యాపారాలపై చెన్నైలో దాడులు జరగడం విశేషం.
Next Story