Sun Apr 28 2024 20:09:01 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ప్రముఖ సంస్థలపై ఐటీ దాడులు
హైదరాబాద్ లోని పలు సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, డీఎస్ఏ బిల్డర్స్ ఆండ్ కన్ స్ట్రక్షన్స్, శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ సంస్థలపై ఇవాళ ఉదయం నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. రవి ఫుడ్స్ డైరెక్టర్ రవిందర్ కుమార్ అగర్వాల్, శాంతా శ్రీరామ్ ఎండీ మడ్డి నర్సయ్య ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. డీఎస్ఏ బిల్డర్స్ లో టీడీపీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ ముగ్గురు కుమారులు ప్రమోటర్లుగా ఉన్నారు.
Next Story